మల్యాలలో విషాదం:
కుమారుడితో కలిసి బావిలో దూకి తల్లి ఆత్మహత్య
మల్యాల, జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కన్న కొడుకుతో కలిసి ఓ తల్లి బావిలో దూకి ప్రాణాలు తీసుకున్న హృదయవిదారక ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. మల్యాలకు చెందిన గుండేటి కవిత (36) తన భర్త దశరథంతో కలిసి నివసిస్తోంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ముత్యంపేట గుడిపేట శివారులోని ఓ వ్యవసాయ బావి వద్ద చెప్పులు, సెల్ఫోన్ పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అంతకుముందు బాధితురాలు తన అన్న కొమురయ్యకు ఫోన్ చేసి, అన్నా.. నేను చనిపోతున్నా అని చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్సై సందీప్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బావిలో నుంచి మృతదేహాలను వెలికితీసి, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఎస్సై సందీప్ దర్యాప్తు ప్రారంభించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


