ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం
షాబాద్, (రంగారెడ్డి): షాబాద్ మండలం కేంద్రంలోని షాబాద్ మోడల్ స్కూల్,కాలేజ్ , ప్రభుత్వ పాఠశాల విద్యాసంస్థల బంద్ కార్యక్రమం శుక్రవారం విజయవంతం అయ్యింది.ఎస్ఎఫ్ఐ షాబాద్ మండల కేంద్రంలోని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ...ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడులపై పారదర్శకంగా విచారణ జరిపించాలని,నీట్ పేపర్ లీక్ అవ్వడం వల్ల చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం అందించాలని,ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఎన్టిఏ రద్దు చేయాలని. వి బి ఎస్ ఏ బిల్లు వెనక్కి తీసుకోవాలని,కేంద్రంలో,రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో షాబాద్ ఎస్ఎఫ్ఐ నాయకులు శివ శంకర్ యాదవ్, సిద్ధి, తేజ, అనిల్ యాదవ్,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Views: 37
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
24 Jul 2026 18:44:48
దౌల్తాబాద్ (సిద్ధిపేట్): మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు ఏకరూప దుస్తులను మండల విద్యాధికారి గజ్జెల కనకరాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
