జాతీయ ఉపాధి హామీ ఉద్యోగులు ఆడిందే ఆట...పాడిందే పాట...
పాపన్నపేట,: కేంద్రమైన పాపన్నపేట జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ ఆర్ఈజిఎస్) కార్యాలయంలో ఉద్యోగులు సెల్ ఫోన్లలో వీక్షిస్తూ, కార్యాలయానికి వచ్చిన వారిని పట్టించుకోకుండా ఆడిందే ఆట...పాడిందే పాట..అన్నట్లు వ్యవహరిస్తున్నారని మండల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన కొందరు ప్రజా ప్రతినిధులు, ఉపాధి హామీ పథకం కూలీలు వాపోతున్నారు. శుక్రవారం రోజు మధ్యానం 01.20గం.కు కార్యాలయానికి వెళ్లిన విలేకరులకు చేదు అనుభవం ఎదురైంది.కూలీలు అడిగిన ప్రశ్నలకు సిబ్బంది సరిగా సమాధానం చెప్పలేని రీతిలో,తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ నిబంధనలను విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.ఈ విషయమై పాపన్నపేట మండల ఏపిఓ బి. మైపాల్ రెడ్డినీ పోన్ లో సంప్రదించడానికి విలేకరులు ప్రయత్నించినప్పటికీ ఆయన స్పందించలేదు.ఇప్పటికైనా కార్యాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి,సరైన సమాధానం ఇవ్వాలని వారు కోరుతున్నారు.
Views: 452
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
24 Jul 2026 18:44:48
దౌల్తాబాద్ (సిద్ధిపేట్): మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు ఏకరూప దుస్తులను మండల విద్యాధికారి గజ్జెల కనకరాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
