ఆదర్శనగర్ కాలనీలో ఘనంగా బోనాల వేడుకలు
చౌటకూర్: సంగారెడ్డి జిల్లా ఆదర్శనగర్ కాలనీలో ఆదర్శనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కే. శంకర్ ఆధ్వర్యంలో ఆదివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. కాలనీలో వరుసగా 12వ ఏడాది బోనాల ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో జరిగిన వేడుకల్లో కాలనీవాసులు ఉత్సాహంగా పాల్గొని పండుగను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్, చంద్రశేఖర్, రాజ్కుమార్, తుకారం, ఆనంద్, వెంకటేశం, ఏవీ నర్సింలు, నరసింహరాజు, మారుతి, ప్రశాంత్, మల్లారెడ్డి, అడివయ్యతో పాటు ప్రసన్నవాణి, అంజలి, విశాల, వాణి, లక్ష్మి, రుక్మిణి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం భక్తిశ్రద్ధల నడుమ విజయవంతంగా ముగిసింది.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


