భారీ వర్షంలోనూ కొండగట్టు అంజన్న గిరిప్రదక్షిణ
పాల్గొన్న మంత్రులు పొన్నం, లక్ష్మణ్, విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే సత్యం
మల్యాల, : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ అంజనేయ స్వామివారిని దర్శించుకున్న రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ & వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మరియు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంలు స్వామివారి గిరిప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కురుస్తున్న భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా, భక్తులతో కలిసి ప్రజాప్రతినిధులు కొండ చుట్టూ గిరిప్రదక్షిణ పూర్తి చేశారు. కాళ్లకు చెప్పులు కూడా లేకుండా, వానలో తడుస్తూనే భక్తిశ్రద్ధలతో ముందుకు సాగారు. స్వామివారి నామస్మరణతో కొండగట్టు క్షేత్ర పరిసరాలు మారుమోగాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ: "మా పిలుపు అందుకొని వర్షంలోనూ ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులకు, నాయకులకు ధన్యవాదాలు. ఆ అంజనేయ స్వామి కృపాకటాక్షాలతోనే ఈ గిరిప్రదక్షిణ కార్యక్రమం ప్రశాంతంగా, దిగ్విజయంగా పూర్తయింది. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని స్వామివారిని వేడుకున్నాం" అని తెలిపారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గిరిప్రదక్షిణలో పాల్గొన్న ప్రజాప్రతినిధులను స్థానిక ప్రజలు, భక్తులు, కార్యకర్తలు విశేషంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Views: 70
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
