ఉప సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర ఫోరం అధ్యక్షులు బోట్ల కార్తీక్
మల్యాల: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ముత్యంపేట ఉప సర్పంచ్ కందరి ముత్యం రెడ్డి తండ్రి ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఉప సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ సోమవారం ముత్యంపేటకు చేరుకుని, ఉప సర్పంచ్ ముత్యం రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లేశం, రాష్ట్ర కార్యదర్శి రాజి రెడ్డి, జిల్లా అధ్యక్షులు ముత్యాల స్వామి, స్థానిక సర్పంచ్ ఆదిరెడ్డి, వాడు మెంబర్ పంజాల రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Views: 21
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
10 Aug 2026 18:32:03
పాపన్నపేట ; పాపన్నపేట మండల అధ్యక్షుడిగా జిన్నగోపాల్ కిషన్ మోర్చా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. మండలంలో పార్టీ బలోపేతానికి...
