మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ లో 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
నస్పూర్, : మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ లో ఆగస్టు 15, 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత సలహాదారుడు హర్కర వేణుగోపాల్ రావు పోలీసుల వందనం స్వీకరించి అనంతరం జాతీయ జెండా ఎగరవేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, గృహాజ్యోతి పథకం, రుణ మాఫీ, రైతు భరోసా, ధాన్యం కొనుగోలు, చేయూత పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరా మహిళా శక్తి, కల్యాణ లక్ష్మి /షాది ముబారక్, ఉపాధికల్పన మరియు ఇతర పథకాల గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్, డీసీపీ అగ్గడి భాస్కర్, మేయర్ మధుకర్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


