అంబేద్కర్ కళాభవనానికి రూ.1.90 కోట్ల మంజూరు
మిడ్జిల్ : మిడ్జిల్ మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ కళాభవనం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1.90 కోట్లు మంజూరు చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి , జడ్చర్ల ఎమ్మెల్యే శ్రీ జనంపల్లి అనిరుధ్ రెడ్డి కి అంబేద్కర్ విజ్ఞాన సేవా సమితి సభ్యులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మిడ్జిల్ మండల ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన అంబేద్కర్ కళాభవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. ఈ కళాభవనాన్ని అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగా, విద్యా, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరారు. మిడ్జిల్ మండలానికి ఇది ఒక ఆదర్శ విజ్ఞాన కేంద్రంగా నిలవాలని ఆకాంక్షించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సమాజ అభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలు కళాభవనం ద్వారా నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యే శ్రీ జనంపల్లి అనిరుధ్ రెడ్డికి మండల ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎడ్ల శంకర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎం.డి. గౌస్, అంబేద్కర్ విజ్ఞాన సేవా సమితి అధ్యక్షుడు శారద వెంకటయ్య, బాదేపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ జ్యోతి అల్వాల్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ గౌస్,అంబేద్కర్ విజ్ఞాన సేవా సమితి అధ్యక్షులు బి దేవయ్య గౌరవ అధ్యక్షులు బి బాలయ్య విగ్రహ స్థాపన కమిటీ అధ్యక్షులు శారద వెంకటయ్య ఉపాధ్యక్షులు బి బుచ్చయ్య సీనియర్ నాయకులు బి దానియేల్, బి రాములు, మాజీ ఎంపీటీసీ జొన్నలగడ్డ సంపత్ కుమార్, బర్గల ఆదాం, మిడ్జిల్ ఉప సర్పంచ్ మమత మన్యం మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బంగారు, ఆయా గ్రామాల సర్పంచులు, దళిత సంఘాల ,నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


