భక్తి శ్రద్ధలతో శ్రీ సాయిబాబా పల్లకి ఊరేగింపు.
పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాల్రెడ్డి.
తాండూరు (వికారాబాద్ జిల్లా) తాండూర్ పట్టణంలో గురు పౌర్ణమి పురస్కరించుకుని శ్రీ సాయిబాబా పల్లకి ఊరేగింపును భక్తులు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. శ్రీ సాయిబాబా పల్లకి ఊరేగింపు కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ళ నీరజ బాల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, ఆధ్యాత్మిక వాతావరణంలో సాగిన ఈ ఊరేగింపులో చైర్పర్సన్ తో పాటు శంకర్ యాదవ్, రాజ్ కుమార్, నాయకులు, ప్రజా ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో బాబా భక్తులు, పట్టణ ప్రజలు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ సాయిబాబా ఆశీస్సులతో తాండూర్ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నట్లు తెలిపారు.

Views: 32
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
28 Jul 2026 18:28:10
గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) : శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ విశ్వవిద్యాలయం, ములుగు, సిద్ధిపేటలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్ ఆధ్వర్యంలో, పుష్కల్...
