పాపన్నపేట ఉన్నత పాఠశాల ఆకస్మిక తనకి
పాపన్నపేట : మండలకేంద్రమైన పాపన్నపేట ఉన్నత పాఠశాలను మెదక్ జిల్లా విద్యాశాఖాధి కారి రాజు మంగళవారం ఉదయం ఆకస్మికంగా తనికి చేశారు. ఈ సందర్భంగా రికార్డులు ,పాఠశాల పరిసరాలు పరిశీలించారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అనంతరం మండల పరిధిలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా పిఆర్టియు నాయకులు మొదటిసారి వచ్చిన డిఈఓ రాజును సన్మానించారు. ఆయన వెంట సీఎంఓ రాజు, ఎంఈఓ ప్రతాప్ రెడ్డి ప్రధాన ఉపాధ్యాయులు మహేశ్వర్ ,శ్రీనివాసరావు నార్సింగి పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనిల్ కుమార్, నాగరాజు, వెంకట్రాంరెడ్డి, ఉపాధ్యాయ సంఘం నాయకులు ఉపాధ్యాయులు తదితరులున్నారు.
Views: 217
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
28 Jul 2026 18:28:10
గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) : శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ విశ్వవిద్యాలయం, ములుగు, సిద్ధిపేటలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్ ఆధ్వర్యంలో, పుష్కల్...
