బస్ భవన్ ముట్టడి జయప్రదం చేయండి

బస్ భవన్ ముట్టడి జయప్రదం చేయండి

వనపర్తి : తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల ఏరియర్స్‌ (2017-2021) వెంటనే చెల్లించాలనీ  జిల్లా గౌరవ అధ్యక్షులు వాకిటి శ్రీధర్డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వాకిటి శ్రీధర్, రాష్ట్ర కార్యదర్శి సత్యన్న, కార్యనిర్వాహక అధ్యక్షులు రాంచంద్రారెడ్డితో కలిసి, విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ ఆగస్టు 4 వ తేది హైదరాబాద్ బస్ భవన్ ముట్టడి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రిటైర్డ్ ఉద్యోగుల సాధన మరియు బద్రత కోసం భారీ నిరసన కార్యక్రమము జరపతల పెట్టామని  కార్మికులందరూ అందరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు. విశ్రాంత ఉద్యోగులకు 2017 సం॥ నుండి 2021 ఏరియర్స్‌ను వెంటనే చెల్లించాలనీ, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు రావలసిన బెనిఫిట్స్ ను చెల్లించి. సూపర్‌ లగ్జరీ బస్సులో భార్యాభర్తలకు ఇరువూరికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలనీ, ,తార్నాక ఆసుపత్రి లో మెరుగైన వైద్య సౌకర్యం కల్పిస్తూ రోగులకు రెండు నెలలకు సరిపడు మందులు ఇవ్వాలనీ  డిమాండ్ చేశారు.బస్సు భవన్ ముట్టడితో యాజమాన్యం దిగి రాకపోతే ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
Views: 60

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

వ్యవసాయంలో డ్రోన్లు - టమాటా గ్రాఫ్టింగ్ పై అవగాహన సదస్సు వ్యవసాయంలో డ్రోన్లు - టమాటా గ్రాఫ్టింగ్ పై అవగాహన సదస్సు
గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) :  శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ విశ్వవిద్యాలయం, ములుగు, సిద్ధిపేటలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్ ఆధ్వర్యంలో, పుష్కల్...
సింగరేణిలో హౌసింగ్ పీడీ పర్యటన
అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
వర్షానికి రోడ్డుపైకి వచ్చిన కొండచిలువ.
కొండగట్టులో గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి
జలసిరి ఫామ్ పౌండ్లు, వ్యక్తిగత సోక్ పిట్స్ అమలుపై రాష్ట్రస్థాయి ఆన్‌లైన్ శిక్షణ