బాధితురాలికి సీఎంఆర్ఎఫ్ చెక్ అందజేత
కారేపల్లి(ఖమ్మం): సింగరేణి మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన జోగ మల్లమ్మ ఇటీవల అనారోగ్యానికి గురై, ఆసుపత్రిలో చికిత్స పొంది,ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుంది.వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్ సహకారంతో మంజూరైన 48 వేల రూపాయల సీఎం సహాయనిధి చెక్కును గురువారం సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాగండ్ల జగన్,స్థానిక సర్పంచ్ మూడ్ కిషోర్ చేతుల మీదుగా బాధితురాలు మల్లమ్మకు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలు కూడా మెరుగైన వైద్యం పొందాలనే ఉద్దేశంతో,వారికి వైద్యం ఆర్థికంగా భారం కాకూడదని ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా బాధితులకు సహాయం అందజేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అజ్మీరా ఈర్యా,సురేందర్ రెడ్డి ,బాణోత్ నవీన్,కుంజా రామకృష్ణ,అజ్మీరా సుమన్,మూడ్ కిరణ్ పాల్గొన్నారు.
Views: 10
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
05 Aug 2026 18:12:49
మందమర్రి, (మంచిర్యాల) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో ఒప్పంద పద్ధతిన పని చేస్తున్న కార్మికులకు పాత ప్రకారమే వేతనాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్...
