అర్హులైన లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
బిచ్కుంద, : బిచ్కుందలో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు హాజరై అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులను అందజేశారు. నియోజకవర్గంలో అర్హులైన పేద కుటుంబాలకు సుమారు 16,564 నూతన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నట్లు అధికారులు, ప్రజాప్రతినిధులు తెలిపారు. రేషన్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ ఆహార భద్రతా పథకాల ప్రయోజనాలు అందనున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. గత పదేళ్లలో కొత్త రేషన్ కార్డుల జారీ జరగలేదని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, మున్సిపల్ చైర్మన్ సీమ షెట్కర్, వైస్ చైర్మన్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


