శివంపేటలో రైస్ మిల్లులో విజిలెన్స్ తనిఖీలు
శివంపేట, (మెదక్): శివంపేట మండలంలోని రైస్ మిల్లుల్లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. మంగళవారం మండలంలోని గూడూరు గ్రామంలో ఉన్న ఓం సాయి వెంకటరమణ రైస్ మిల్లులో విలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వం కేటాయించిన ధాన్యం, మిల్లుల నుంచి ప్రభుత్వానికి అందించిన బియ్యం, ప్రస్తుతం మిల్లులో ఉన్న ధాన్యం నిల్వల వివరాల ను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ధాన్యం నిల్వలు, రికార్డులను తనిఖీ చేస్తూ వివరాలను నమోదు చేసుకున్నారు. రైస్ మిల్లుల్లో విజిలెన్స్ తనిఖీలు కొనసాగుతుండటంతో మిల్లర్లలో ఆందోళన నెలకొంది. అధికారుల తనిఖీలతో ధాన్యం నిల్వలు, ప్రభుత్వానికి అందించిన బియ్యం వివరాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


