ఆర్యవైశ్య బెల్లంపల్లి డివిజన్ ఎన్నికల కన్వీనర్గా రేణికుంట్ల శ్రీనివాస్
బెల్లంపల్లి మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి డివిజన్లోని పట్టణ, మండల ఆర్యవైశ్య సంఘాల ఎన్నికల నిర్వహణకు మాజీ జిల్లా అధ్యక్షుడు రేణికుంట్ల శ్రీనివాస్ను కన్వీనర్గా నియమించారు. మంచిర్యాలలో జరిగిన జిల్లా ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నెల రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయడంతో పాటు సభ్యత్వాన్ని పెంచేందుకు కృషి చేయాలని కమిటీకి సూచించారు. సమావేశానికి జిల్లా అధ్యక్షుడు కొత్త వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా, తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అదనపు ప్రధాన కార్యదర్శి ముక్తా శ్రీనివాస్, ప్రత్యేక సలహాదారు నలుమాసు కాంతయ్య తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


