శివ స్వాముల పై లాఠీచార్జి హేయం– VHP ధర్మాచార్య ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి

WhatsApp Image 2026-02-10 at 4.08.35 PM

 

శ్రీశైలం  : శ్రీశైలం వంటి మహా శైవ క్షేత్రంలో దర్శనానికి వచ్చిన సాధూ సంతులు, భక్తులపై లాఠీచార్జి జరగడం  చరిత్రలోనే అత్యంత సిగ్గుచేటైన ఘటన అని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ధర్మాచార్య సంపర్క ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా “ఓం నమః శివాయ” అంటూ దర్శనం కోరిన భక్తులపై బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చగా నిలుస్తోందని పేర్కొన్నారు. సోమవారం శ్రీశైలం మలన్న సన్నిధానంలో సాధూ సంతులు, శివ స్వాములపై  జరిగిన దాడిని ఖండిస్తూ మంగళవారం బాలస్వామి పత్రిక ప్రకటన విడుదల చేశారు.భక్తుల భద్రత, క్రమబద్ధమైన దర్శన ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలమైన అధికారులు – తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి లాఠీలతో భక్తులను కొట్టడం అమానుషం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం పరిపాలనా తప్పిదం కాదు; హిందూ ధర్మాన్ని, భక్తుల ఆస్తిక భావాలను అణచివేసే దౌర్జన్య చర్య అని పోలీసుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేవాలయం అన్నది పోలీసు శిబిరం కాదని, శివ స్వాములు, సాధూ సంతులు  నేరస్తులు కాదని, పవిత్ర పుణ్య క్షేత్రంలో పోలీసులకు ఏం పని అని ఆయన ప్రశ్నించారు.అయినా శ్రీశైలంలో భక్తులను శత్రువులుగా చూశారనీ, మహిళలు, వృద్ధులు, చిన్నారులు కూడా లాఠీచార్జికి గురవడం రాష్ట్ర ప్రభుత్వ హిందూ వ్యతిరేక వైఖరిని బహిర్గతం చేస్తోందని విమర్శించారు. భక్తుల సహనాన్ని బలహీనతగా భావిస్తే అది పాలకుల అపోహ అని, హిందూ సమాజం ఇక మౌనంగా ఉండదని, ధర్మక్షేత్రాల్లో దౌర్జన్యం జరిగితే విశ్వహిందూ పరిషత్ నిశ్శబ్దంగా ఉండే ప్రశ్నే లేదని బాలస్వామి హెచ్చరించారు. లాఠీచార్జికి బాధ్యులైన అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలనీ.. గాయపడిన భక్తులకు పూర్తి వైద్యసాయం, న్యాయమైన పరిహారం ఇవ్వాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తుందన్నారు.లాఠీ ఛార్జీ ఘటన విషయంలోశ్రీశైలం దేవస్థాన నిర్వహణపై స్వతంత్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.భవిష్యత్తులో భక్తులపై బలప్రయోగం జరగకుండా స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలన్నారు. ధర్మాన్ని అవమానిస్తే పోరాటం తప్పదనీ, భక్తుడి గౌరవం కోసం పోరాడటం మా కర్తవ్యమని బాలస్వామి పేర్కొన్నారు. రేపటి మహా శివ రాత్రిని దృష్టి లో ఉంచుకొని భక్తులకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేయాలని అధికారులకు, పాలక మండలికి ఆయన సూచించారు.

భవదీయ

 పగుడాకుల బాలస్వామి
ధర్మాచార్య సంపర్క  ప్రముల్
విశ్వహిందూ పరిషత్
తెలంగాణ రాష్ట్రం
9912975753
9182674010

Views: 8

About The Author

Vision Andhra Telugu Daily Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

7కేజీల గంజాయి పట్టివేత.. 7కేజీల గంజాయి పట్టివేత..
    ఖమ్మం  :  మొండికుంట నుండి అశ్వాపురం మార్గం లో ద్విచక్ర వాహనం పై తరలిస్తున్న  7 కేజీ ల  గంజాయి  తరలిస్తూ ఉండగా ఎన్ఫోర్స్మెంట్ టీం
ముగిసిన ఎన్ ఎస్ ఎస్ శీతాకాల ప్రత్యేక శిబిరం.
ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది.. బాధ్యులపై ఉక్కుపాదం తప్పదు! మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడమే లైన్స్ క్లబ్ లక్ష్యం
టీబీ వ్యాధిపై రోగులకు ఎక్స్ రే క్యాంపు
శ్రీశ్రీశ్రీ తిక్క వీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు(జాతర)
మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు.....జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి