నషా ముక్త్ భారత్కు యువత ప్రతిజ్ఞ
• పాల్గొన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల దౌల్తాబాద్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు
దౌల్తాబాద్, సిద్దిపేట : ఉస్మానియా విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్వహించిన నషా ముక్త్ భారత్ అభియాన్ 2026 అవగాహన కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల దౌల్తాబాద్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. కార్యక్రమంలో మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, యువత బాధ్యత, మత్తు రహిత భారత నిర్మాణంపై అవగాహన కల్పించారు. దౌల్తాబాద్ కళాశాల ఎన్ఎస్ఎస్ కార్యక్రమ అధికారులు మంగ్తా నాయక్, సంపత్ ఆధ్వర్యంలో వాలంటీర్లు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటాం మత్తు రహిత భారత నిర్మాణానికి కృషి చేస్తాం అంటూ ప్రతిజ్ఞ చేశారు. వివిధ కళాశాలల ఎన్ఎస్ఎస్ అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


