చేపల వేటకు వెళ్లిన ఆదివాసులపై దాడి ఆరోపణ
ఉట్నూర్: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందనపల్లి శివారులో నదికి చేపల వేటకు వెళ్లిన ఆదివాసి యువకులు కృష్ణ, అనిల్, విష్ణులపై అటవీ శాఖ అధికారులు దాడి చేశారంటూ ఆదివాసీ విద్యార్థి సంఘం, తెలంగాణ సామాజిక స్టూడెంట్ ఆర్గనైజేషన్, తుడుందెబ్బ సంఘాలు ఆరోపించాయి. వైరల్ వీడియోపై సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. బాధితులకు రక్షణ, వైద్య, న్యాయ సహాయం అందించాలని, ఆదివాసుల రాజ్యాంగబద్ధమైన సంప్రదాయ హక్కులను పరిరక్షించాలని ప్రభుత్వాన్ని కోరాయి. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు సిడాం జంగుదేవ్ పటేల్ రాష్ట్ర అధ్యక్షులు, ఆదివాసీ విద్యార్థి సంఘం, జాడి వెంకటేష్ నేత ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, తెలంగాణ సామాజిక స్టూడెంట్ ఆర్గనైజేషన్, మంగం దీపక్ జిల్లా అధికార ప్రతినిధి, ఆదివాసీ విద్యార్థి సంఘం, పెందుర్ త్రిమూర్తి ఉట్నూర్ మండల అధ్యక్షుడు, తుడుందెబ్బ ఆత్రం జంగు సిడాం, పవన్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
15 Aug 2026 18:22:56
నిజామాబాద్ : నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో (జీఎంసీ) 2026, ఆగస్టు 15న 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు మిక్కిలి దేశభక్తి, ఉత్సాహాల మధ్య ఘనంగా జరిగాయి....
