మాతా-శిశు ఆరోగ్య సంరక్షణలో తెలంగాణకు జాతీయస్థాయి గుర్తింపు
On
మాతా-శిశు ఆరోగ్య సంరక్షణలో తెలంగాణకు జాతీయస్థాయి గుర్తింపు
రాష్ట్ర ఆరోగ్య శాఖ పనితీరును మెచ్చిన కేంద్ర ప్రభుత్వం
మాతా-శిశు ఆరోగ్య సేవల్లో తెలంగాణ మరో జాతీయ విజయాన్ని నమోదు చేసింది
మాతా-శిశు ఆరోగ్య సేవల బలోపేతానికి మా ప్రభుత్వం చేపట్టిన చర్యలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి రూ.200 కోట్ల అదనపు ప్రోత్సాహక నిధులను మంజూరు చేయడం ఎంతో సంతోషకరం. ఇది రాష్ట్ర ఆరోగ్య శాఖ సిబ్బంది, వైద్యులు, నర్సులు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది సమిష్టి కృషికి లభించిన గౌరవం.
మా ప్రభుత్వ లక్ష్యం ప్రతి గర్భిణికి, ప్రతి తల్లికి, ప్రతి నవజాత శిశువుకు అత్యుత్తమ నాణ్యమైన వైద్య సేవలు అందించడం. ఈ ప్రోత్సాహక నిధులు మాతృ మరణాలు, నవజాత శిశు మరణాలను మరింత తగ్గించడంలో, రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన మాతా-శిశు ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
తెలంగాణను దేశంలో మాతా-శిశు ఆరోగ్య సేవల్లో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు మా ప్రభుత్వం మరింత కట్టుదిట్టంగా పనిచేస్తూ, ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తుంది
Views: 9
About The Author

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Jul 2026 12:25:58
లింగాల గణపురం (జనగామ): కళ్ళెం గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకులు మబ్బు ఆదాం తల్లి మరణించగా తెలంగాణ రాష్ట్ర...
