భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని
హన్మకొండ: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి తన జన్మదినం సందర్భంగా మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి, ఎమ్మెల్యే దంపతులకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. అమ్మ వారి దర్శనంలో ఎమ్మెల్యే సతీమణి నాయిని నీలిమ రెడ్డి , అల్లుడు విష్ణు వర్ధన్ రెడ్డి , మాజీ మంత్రి వర్యులు పెద్దలు జానారెడ్డి సతీమణి సుమతి కూడా ఉన్నారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే ప్రత్యేకంగా ప్రార్థించారు.
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Jul 2026 18:14:10
హైదరాబాద్: భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ) అమలులోకి వచ్చిన సందర్భంగా బుధవారం హైదరాబాద్లో తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్డమ్ (యూకే)కు వెళ్లే ఎగుమతి కంటైనర్లను అధికారికంగా...
