ఢిల్లీలో విద్యార్థులపై చేసిన లాటిచార్జిని ఖండిస్తూ అచ్చంపేటలో ఏఐఎస్ఎఫ్ నిరసన
అచ్చంపేట : ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థి యువజన సంఘాలపై పోలీసులు జరిపిన లాఠీచార్జిని నిరసిస్తూ అచ్చంపేటలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఏఐఎస్ఎఫ్)ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ ప్రశ్నించిన విద్యార్థులపై పోలీసులు లాటి చార్జీ చేయడం అప్రజాస్వామీ కామనీ అన్నారు విద్యార్థులకు న్యాయపరమైన డిమాండ్లకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం లాఠీ చార్జీలతో ఉద్యమాలను అంచివేయలని ప్రయత్నించడం దురదృష్టకరమని అన్నారు్ దేశంలో 2014 నుండి ఇప్పటివరకు సుమారు 152 పరీక్షల ప్రశ్న పత్రాలు లిక్ అయ్యాయని పేర్కొన్నారు విద్యార్థులలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు లక్షల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకొని ఎన్నో ఆశలతో పరీక్షలకు సిద్ధమవుతున్న తరుణంలో పేపర్లు లీకేజీలతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాగర్ కర్నూల్ జిల్లా సమితి సభ్యులు మధు అర్జున్ చరణ్ సన్నీ తదితరులు పాల్గొన్నారు.
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Jul 2026 18:14:10
హైదరాబాద్: భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ) అమలులోకి వచ్చిన సందర్భంగా బుధవారం హైదరాబాద్లో తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్డమ్ (యూకే)కు వెళ్లే ఎగుమతి కంటైనర్లను అధికారికంగా...
