‘అత్యవసర పరిస్థితులలో ప్రజలకు అందుబాటులో’
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేకానంద
మందమర్రి : ప్రస్తుతం నెలకొన్న వర్ష పరిస్థితులలో ప్రజలకు అందుబాటులో ఉంటూ అత్యవసర సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ,కర్మాగార,గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. గురువారం జిల్లాలోని మందమర్రి మున్సిపల్ పరిధిలోని 19,7 వార్డులలో నెలకొన్న స్థితులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్,ఎ.సి.పి.కిరణ్ కుమార్,మున్సిపల్ కమిషనర్ రాజలింగు,ఎమ్మార్వో సతీష్ లతో కలిసి పరిశీలించారు. ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న వర్ష పరిస్థితులలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,అత్యవసర సేవలను అందించేందుకు అధికార యంత్రాంగం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. మందమర్రి మున్సిపల్ పరిధిలోని 19వ వార్డు కామాఖ్య అమ్మవారి ఆలయానికి వెళ్లే దారిలో నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. అలాగే 7వ వార్డులో కూలిన ఇంటి గోడ స్థితిని పరిశీలించి సంబంధిత ఇంటి యజమానులకు పరిహారం అందించి ఇంటిని నిర్మించేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
30 Jul 2026 19:28:17
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏవిధమైన ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు...
