కార్గిల్ లేక్ అభివృద్ధికి రూ.1.32 కోట్ల నిధులు

కార్గిల్ లేక్ అభివృద్ధికి రూ.1.32 కోట్ల నిధులు

 రాజన్న సిరిసిల్ల  : పట్టణంలోని కార్గిల్ లేక్ అభివృద్ధి పనులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. రూ.1.32 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ అభివృద్ధి పనుల ద్వారా సరస్సు పరిసరాల్లో మౌలిక వసతులను మెరుగుపర్చడంతో పాటు ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం పట్టణాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజలకు నాణ్యమైన మౌలిక వసతులు అందించడమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. కార్గిల్ లేక్ అభివృద్ధి పూర్తయిన అనంతరం స్థానిక ప్రజలకు, సందర్శకులకు మెరుగైన వాతావరణం, విశ్రాంతి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, బీజేపీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. 

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

బీటలువారిన నేల... పెద్దమ్మ తల్లి సన్నిధిలో జలాభిషేకం బీటలువారిన నేల... పెద్దమ్మ తల్లి సన్నిధిలో జలాభిషేకం
మర్పల్లి,(వికారాబాద్): మండలంలో వర్షాభావ పరిస్థితులు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చడంతో అన్నదాతల ఆవేదన తారాస్థాయికి చేరుకుంది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఎంతో ఆశతో సాగు చేసిన పత్తి,...
ఈ నెల 31లోపు రేషన్ కార్డుల ఈ-కేవైసీ పూర్తి చేయాలి
నర్సరీని సందర్శించిన డీఎల్పీఓ చందన
ఆర్‌ఓ ప్లాంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని...
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.
విద్యారంగంపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదు
చౌటకూర్ గ్రామంలో వ్యవసాయ అవగాహన కార్యక్రమం నిర్వహణ