టిఎస్ఆర్టిసి భక్తి ప్యాకేజీ.
జూలై 25న ప్రత్యేక బస్సు ఏర్పాటు, పలు ఆలయాల దర్శనం.
పటాన్ చెరు(సంగారెడ్డి):బిహెచ్ఈఎల్ డిపో నుంచి టిఎస్ ఆర్టిసి పలు ఆలయాల దర్శనానికి ప్రత్యేక బస్సును ఏర్పాటు చేశారు. ఈ నెల 25వ తేదిన ఉదయం 9గంటలకు బిహెచ్ఈఎల్ డిపో నుంచి బయలు దేరే ఈ బస్సు బాచుపల్లి హనుమాన్ ఆలయం, జోగులాంబ అమ్మవారు, శ్రీరంగపురం, కురుమూర్తి దర్శనం, మన్నెకొండ ఆలయాలకు చేరుకుని అనంతరం హైదరాబాద్ చేరుకుంటుంది. సూపర్ లగ్జరీ బస్సు ద్వారా ఈ ఆలయాను దర్శించవచ్చని, పెద్దలకు ఒక్కోరికి టిక్కెట్ ధర 1200 రూపాయలు కాగా, పిల్లలకు 900 రూపాయలుగా నిర్ణయించినట్లు డిపోమేనేజర్ మోహన్ రావు తెలిపారు. మరిన్ని వివరాలకు 8500309052, 9063400960, 7382814249, 7382814582 నెంబర్లను సంప్రదించాలని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


