వర్షాలు కురవాలని గ్రామంలో కప్పమ్మ తల్లికి పూజలు
నాగర్ కర్నూల్ :బిజినాపల్లి :వరుణుడు కరుణించి వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడిపంటలు బాగా పండాలని బిజినాపల్లి మండలం మంగనూరు గ్రామంలో మత్స్య సహకార సంఘం మహిళలు కప్పతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.గ్రామంలోని కప్పమ్మకు పూజలు చేసి, కప్పను ఊరేగింపుగా తీసుకెళ్లారు. మహిళలు ఇంటింటికి తిరుగుతూ కప్పమ్మకి నీళ్లు పోసి,పసుపు-కుంకుమతో పూజించుతూ వాన దేవుని బొడ్డెమ్మ పాటలు పాడుతూ వర్షాలు కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని వేడుకుంటున్నారు .ఈ కార్యక్రమంలో పిట్టల బుడ్డమ్మ, గూడు చేన్నమ్మ, షాగల చేన్నమ్మ, చింతకాయల అలివేల, చింతకాయల శివమ్మ, చింతకాయల భాగ్యమ్మ, గూడు చంద్రమ్మ, పినమోని నాగమణి, మణెమ్మ తదితరులు పాల్గొన్నారు.
Views: 1
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
17 Jul 2026 18:28:46
మర్పల్లి,(వికారాబాద్): మండలంలో వర్షాభావ పరిస్థితులు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చడంతో అన్నదాతల ఆవేదన తారాస్థాయికి చేరుకుంది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఎంతో ఆశతో సాగు చేసిన పత్తి,...
