భూ రిసర్వే తో భూ సంబంధిత సమస్యలు పరిష్కారం
మల్లాపూర్ : జగిత్యాల జిల్లా భూభారతి కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో చేపడుతున్న భూ రీ సర్వే తో భూ సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయని తాసిల్దార్ రామ్ చందర్ అన్నారు. శుక్రవారం మండలంలోని గుండంపల్లి గ్రామంలో భూభారతి భూ రిసర్వే కార్యక్రమం పై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భూమికి సంబంధించిన గ్రామ హద్దులు ఇతరత్రా సమస్యలు భూ రిసర్వే తో పరిష్కారం అవుతాయని అన్నారు. గ్రామ హద్దులను ఏర్పాటు చేసి రీ సర్వే వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. ఈయన వెంట ఆర్ఐ అశోక్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Views: 117
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
17 Jul 2026 18:28:46
మర్పల్లి,(వికారాబాద్): మండలంలో వర్షాభావ పరిస్థితులు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చడంతో అన్నదాతల ఆవేదన తారాస్థాయికి చేరుకుంది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఎంతో ఆశతో సాగు చేసిన పత్తి,...
