ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి

త్రివర్ణ పతాకాల పంపిణీ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ.

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని బస్ స్టాండ్ వద్ద త్రివర్ణ పతకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుల పోరాట స్ఫూర్తితో దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు ప్రతి సంవత్సరం "హర్ ఘర్ తిరంగా" కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. కేవలం స్వాతంత్ర దినోత్సవం ఒక్కరోజు జెండా ఎగురవేయడమే కాకుండా ఇంటిపై నిత్యం రెపరెపలాడాలన్నారు. అలాగే ఈ నెల 14న జరిగే తిరంగా ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ, పోతన్కర్ లక్ష్మీ నారాయణ, ఫ్లోర్ లీడర్ ప్రమోద్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
 
 
Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Related Posts

Error on ReusableComponentWidget

Latest News

మహిళలకు అండగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌... మహిళలకు అండగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌...
హన్మకొండ :అన్నివర్గాల ప్రజలకు అండగా నిలిచిన నాయకుడు సీఎం రేవంత్‌రెడ్డి అన్ని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే,విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  అన్నారు.మంగళవారం ఐనవోలు మండలానికి చెందిన...
అధిక ధరలు రైతు, కార్మిక, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని సిపిఐ సిపిఎం ధర్నా. 
సబ్జెక్టు మార్పుపై అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ
ప్రభుత్వ భూమిలో  నూతన బస్టాండ్ నిర్మించి.
బట్టకాల్చి మీదేయొద్దు గంగుల
వేములవాడలో అఖిలాండ శక్తి స్వరూపిణుల కొలువు ప్రజల అదృష్టం
పేదల గొంతుకగా అన్నాభావు సాటే