<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/sanga-reddy/category-77" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Sanga Reddy - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/77/rss</link>
                <description>Sanga Reddy RSS Feed</description>
                
                            <item>
                <title>వర్షానికి రోడ్డుపైకి వచ్చిన కొండచిలువ.</title>
                                    <description><![CDATA[<div>
<ul>
<li>వాహనాలు ఆపి వీడియోలు తీసిన ప్రజలు.</li>
<li>వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలని సూచన</li>
</ul>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/sanga-reddy/there-is-commotion-in-the-village-of-chakriyala-where-the/article-3802"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1001138642.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">చౌటకూర్, : సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం పరిధిలోని చక్రియాల గ్రామంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం అనంతరం అరుదైన ఘటన చోటుచేసుకుంది. పంట పొలాల నుంచి బయటకు వచ్చిన ఓ పెద్ద కొండచిలువ గ్రామ సమీపంలోని రహదారిని దాటుతూ కనిపించడంతో అక్కడి ప్రజలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు.ఆ సమయంలో శివంపేట నుంచి చక్రియాల గ్రామానికి వస్తున్న వాహనదారులు తమ వాహనాలను నిలిపివేసి కొండచిలువను ఆసక్తిగా వీక్షించారు. పలువురు తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో అవి వైరల్‌గా మారాయి.ఈ ఘటనతో కొంతసేపు రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనంతరం కొండచిలువ సమీపంలోని పొదల్లోకి వెళ్లిపోవడంతో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, వర్షాకాలంలో పాములు, కొండచిలువలు వంటి అడవి జీవులు నీటి ప్రవాహాల కారణంగా రహదారులపైకి వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా రాత్రి సమయంలో ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, వేగాన్ని తగ్గించి జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. ఇలాంటి పరిస్థితులు ఎదురైతే వాహనాలను సురక్షితంగా నిలిపి, వాటిని రెచ్చగొట్టకుండా సంబంధిత అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు</div>
</div>
<div class="yj6qo" style="text-align:justify;"> </div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Sanga Reddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/sanga-reddy/there-is-commotion-in-the-village-of-chakriyala-where-the/article-3802</link>
                <guid>https://www.visionandhra.in/telangana/sanga-reddy/there-is-commotion-in-the-village-of-chakriyala-where-the/article-3802</guid>
                <pubDate>Tue, 28 Jul 2026 18:20:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1001138642.jpg"                         length="21190"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జలసిరి ఫామ్ పౌండ్లు, వ్యక్తిగత సోక్ పిట్స్ అమలుపై రాష్ట్రస్థాయి ఆన్‌లైన్ శిక్షణ</title>
                                    <description><![CDATA[<div>
<ul>
<li>చౌటకూర్ మండలంలో పంచాయతీ సిబ్బందికి అవగాహన </li>
<li>అభివృద్ధి పనుల సమర్థ అమలుపై అధికారుల దిశానిర్దేశం</li>
</ul>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/sanga-reddy/jalasiri-farm-pounds-state-level-online-training-on-implementation-of/article-3799"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/sang.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">చౌటకూర్,: చౌటకూర్ మండల కేంద్రంలో మంగళవారం జలసిరి ఫామ్ పౌండ్లు, వ్యక్తిగత సోక్ పిట్స్ (ఇంకుడు గుంతలు) అమలుకు సంబంధించి రాష్ట్రస్థాయి నుంచి ఆన్‌లైన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల అమలులో భాగంగా పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, మేట్లకు ఈ శిక్షణ అందించారు.శిక్షణలో జలసిరి ఫామ్ పౌండ్ల నిర్మాణ విధానం, వ్యక్తిగత సోక్ పిట్స్ ఏర్పాటు, పనుల ఎంపిక, నాణ్యతా ప్రమాణాలు, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పనుల అమలు, ప్రజలకు కలిగే ప్రయోజనాలు తదితర అంశాలపై రాష్ట్రస్థాయి నిపుణులు సమగ్రంగా వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, పారిశుద్ధ్య మెరుగుదల లక్ష్యంగా ఈ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) కే. శంకర్, సహాయ ప్రాజెక్టు అధికారి (ఏపీఓ) రామ్మోహన్, ఇంజినీరింగ్ కన్సల్టెంట్ మహేశ్వర్ రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్లు ప్రతాప్ రెడ్డి, రమేష్, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు పాల్గొని శిక్షణను పూర్తిచేశారు.శిక్షణలో పాల్గొన్న అధికారులు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా గ్రామాల్లో జలసిరి ఫామ్ పౌండ్లు, వ్యక్తిగత సోక్ పిట్స్ పనులను నాణ్యతతో, వేగవంతంగా అమలు చేసి గ్రామీణాభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. </div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Sanga Reddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/sanga-reddy/jalasiri-farm-pounds-state-level-online-training-on-implementation-of/article-3799</link>
                <guid>https://www.visionandhra.in/telangana/sanga-reddy/jalasiri-farm-pounds-state-level-online-training-on-implementation-of/article-3799</guid>
                <pubDate>Tue, 28 Jul 2026 18:10:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/sang.jpg"                         length="58374"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title> నత్తనడకన  గ్రంథాలయ భవన నిర్మాణం </title>
                                    <description><![CDATA[<ul>
<li>శివంపేట జెడ్పీహెచ్‌ఎస్‌లో అసంపూర్తిగా గ్రంథాలయ భవనం.. ఉపాధ్యాయుల ఆందోళన</li>
<li>పనులు వేగవంతం చేయాలని సర్పంచ్, ఉపాధ్యాయుల విజ్ఞప్తి</li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/sanga-reddy/the-construction-of-the-library-building-has-been-delayed-due/article-3797"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/lyb.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div>
<div style="text-align:justify;">చౌటకూర్, : చౌటకూర్ మండలంలోని శివంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్మాణంలో ఉన్న గ్రంథాలయ భవనం పనులు నత్తనడకన సాగుతున్నాయని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనులు ప్రారంభమై చాలా కాలం గడిచినా ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో విద్యార్థులు, పాఠశాల సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.స్థానిక సమాచారం ప్రకారం, నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌కు ఇప్పటివరకు బిల్లులు విడుదల కాకపోవడంతో పనులు మందగించాయని తెలుస్తోంది. అయితే నిర్మాణంలో ఇప్పటికే కొన్ని చోట్ల గోడలకు పగుళ్లు (క్రాక్‌లు) కనిపిస్తున్నాయని, కొన్ని పిల్లర్ల నిర్మాణంపై కూడా సందేహాలు ఉన్నాయని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు సంబంధిత కాంట్రాక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ఆశించిన స్థాయిలో స్పందన లేదని ఆరోపించారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ, ఆగస్టు నెలలోపు గ్రంథాలయ భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ గతంలో హామీ ఇచ్చారని, కానీ ఇప్పటికీ పనుల్లో పురోగతి కనిపించడం లేదన్నారు. గ్రామ సర్పంచ్ కూడా పలుమార్లు ఫోన్ ద్వారా పనులు వేగవంతం చేయాలని సూచించినప్పటికీ, కాంట్రాక్టర్ మాటలకే పరిమితమవుతున్నారని తెలిపారు.పాఠశాలలో విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, పెండింగ్ బిల్లుల సమస్యను పరిష్కరించడంతో పాటు నిర్మాణ పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయించాలని ఉపాధ్యాయులు, గ్రామస్థులు కోరుతున్నారు. అలాగే నిర్మాణ నాణ్యతపై కూడా సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు సమగ్రంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. </div>
</div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Sanga Reddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/sanga-reddy/the-construction-of-the-library-building-has-been-delayed-due/article-3797</link>
                <guid>https://www.visionandhra.in/telangana/sanga-reddy/the-construction-of-the-library-building-has-been-delayed-due/article-3797</guid>
                <pubDate>Tue, 28 Jul 2026 18:04:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/lyb.jpg"                         length="318136"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పుల్కల్‌లో రూ.18 లక్షలతో సీసీ డ్రైనేజీ పనులకు శ్రీకారం</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">చౌటకూర్: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ నిధులతో చేపట్టనున్న సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ లావణ్య–కృష్ణారెడ్డి మంగళవారం టెంకాయ కొట్టి ప్రారంభించారు. గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూఈ పనులకు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా సర్పంచ్ లావణ్య–కృష్ణారెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆశీస్సులు, సహకారంతో గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామంలోని అన్ని వీధుల్లో దశలవారీగా అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. సుమారు రూ.18 లక్షల వ్యయంతో సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపడుతున్నామని, పనులను నాణ్యతతో పాటు నిర్ణీత గడువులో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ సహాయ ఇంజనీర్ (ఏఈ), గ్రామ కార్యదర్శి ప్రవీణ్, ఉపసర్పంచ్ ప్రవీణ్ కుమార్, వార్డు సభ్యులు చింత నరేందర్, మంగలి రాజు, కనిగిరి మల్లేశం, మాజీ సర్పంచ్ శ్రవణ్ కుమార్,</div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/sanga-reddy/cc-drainage-works-started-in-pulkal-with-rs-18-lakh/article-3792"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1001138470.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">చౌటకూర్: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ నిధులతో చేపట్టనున్న సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ లావణ్య–కృష్ణారెడ్డి మంగళవారం టెంకాయ కొట్టి ప్రారంభించారు. గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూఈ పనులకు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా సర్పంచ్ లావణ్య–కృష్ణారెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆశీస్సులు, సహకారంతో గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామంలోని అన్ని వీధుల్లో దశలవారీగా అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. సుమారు రూ.18 లక్షల వ్యయంతో సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపడుతున్నామని, పనులను నాణ్యతతో పాటు నిర్ణీత గడువులో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ సహాయ ఇంజనీర్ (ఏఈ), గ్రామ కార్యదర్శి ప్రవీణ్, ఉపసర్పంచ్ ప్రవీణ్ కుమార్, వార్డు సభ్యులు చింత నరేందర్, మంగలి రాజు, కనిగిరి మల్లేశం, మాజీ సర్పంచ్ శ్రవణ్ కుమార్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ చారి, మాజీ సర్పంచ్ మఠం సిద్ధయ్య, మల్లారెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధి పనులు వేగవంతం కావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. </div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Sanga Reddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/sanga-reddy/cc-drainage-works-started-in-pulkal-with-rs-18-lakh/article-3792</link>
                <guid>https://www.visionandhra.in/telangana/sanga-reddy/cc-drainage-works-started-in-pulkal-with-rs-18-lakh/article-3792</guid>
                <pubDate>Tue, 28 Jul 2026 17:05:11 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1001138470.jpg"                         length="2287832"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>శివంపేట బీర్ ఫ్యాక్టరీపై మరోసారి కాలుష్య ఆరోపణలు</title>
                                    <description><![CDATA[<ul>
<li>వర్షపు రాత్రుల్లోనే వ్యర్థ జలాల విడుదల చేస్తున్నారని గ్రామస్తుల ఆందోళన</li>
<li>మంజీరా నది కలుషితమవుతోందని ఆరోపణలు</li>
<li>అధికారుల మౌనంపై గ్రామస్తుల అసంతృప్తి</li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/sanga-reddy/pollution-allegations-against-shivampet-beer-factory-once-again-villagers/article-3771"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1001118155.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">చౌటకూర్, : సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం శివంపేట సమీపంలోని బీర్ ఫ్యాక్టరీపై గ్రామస్తులు మరోసారి కాలుష్య ఆరోపణలు చేస్తున్నారు. వర్షం కురిసే రాత్రి వేళల్లో ఫ్యాక్టరీ నుంచి వ్యర్థ జలాలను విడుదల చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. రాత్రి సమయం లో ఎవరూ గమనించరనే ఉద్దేశంతో ఈ చర్యలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు.ఈ వ్యర్థ జలాలు మంజీరా నదిలో కలవడం వల్ల నది నీరు కలుషితమవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే తెల్లవారుజామున మాత్రం ఫ్యాక్టరీ యాజమాన్యం విడుదలవుతున్నది వర్షపు నీరేనని చెబుతోందని గ్రామస్తులు అంటున్నారు. రాత్రి సమయంలో కాలుష్య జలాలు, ఉదయం మాత్రం వర్షపు నీరని చెప్పడం ద్వారా వాస్తవాలను దాచిపెడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.ఈ అంశంపై సంబంధిత అధికారులు ఇప్పటివరకు సమగ్ర విచారణ చేపట్టకపోవడం, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీ నుంచి విడుదలవుతున్న నీటిపై స్వతంత్రంగా నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించి, నిజానిజాలను వెలుగులోకి తీసుకురావాలని వారు డిమాండ్ చేస్తున్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Sanga Reddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/sanga-reddy/pollution-allegations-against-shivampet-beer-factory-once-again-villagers/article-3771</link>
                <guid>https://www.visionandhra.in/telangana/sanga-reddy/pollution-allegations-against-shivampet-beer-factory-once-again-villagers/article-3771</guid>
                <pubDate>Tue, 28 Jul 2026 14:54:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1001118155.jpg"                         length="221988"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మంజీరా నదిని కలుషితం చేస్తున్న చార్మినార్ బీర్ పరిశ్రమ?</title>
                                    <description><![CDATA[<ul>
<li> కలుషిత జలాల విడుదలపై గ్రామస్తుల ఆగ్రహం</li>
<li>సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్</li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/sanga-reddy/charminar-beer-industry-polluting-manjira-river/article-3761"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1001137546.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div>చౌటకూర్: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం శివంపేట గ్రామ శివారులో ఉన్న ఏబీఐఎన్ చార్మినార్ బీర్ పరిశ్రమ నుంచి విడుదలవుతున్న కలుషిత జలాల వల్ల మంజీరా నది కాలుష్యానికి గురవుతోందని గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమ నుంచి రసాయనాలతో కూడిన వ్యర్థ జలాలను నేరుగా మంజీరా నదిలోకి వదులుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలాన్ని ఆసరాగా చేసుకుని ఈ వ్యర్థ జలాలను నదిలోకి విడుదల చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. గ్రామస్తుల కథనం ప్రకారం, గతంలో కూడా నదిలో చేపలు మృతిచెందిన ఘటనలు చోటుచేసుకున్నాయని, అప్పటి నుంచే నదీ జలాల కాలుష్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం నదిలోకి చేరుతున్న రసాయన వ్యర్థాల కారణంగా నీటి రంగు మారడంతో పాటు దుర్వాసన వస్తోందని, ఒకప్పుడు తాగునీటి అవసరాలకు ఉపయోగపడిన మంజీరా నీటిని ఇప్పుడు వినియోగించడానికి ప్రజలు భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కలుషిత జలాల ప్రభావంతో పశువులు, పక్షులు, జలచరాల మనుగడకు ముప్పు ఏర్పడుతోందని గ్రామస్తులు పేర్కొన్నారు. అదే విధంగా ఈ నీటిని వినియోగించే ప్రజల ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంజీరా నది పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజల జీవనాధారం ఈ నదేనని, దానిని కలుషితం చేయడం వల్ల పర్యావరణంతో పాటు ప్రజల జీవన విధానంపైనా తీవ్ర ప్రభావం పడుతుందని వారు తెలిపారు.కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి పరిశ్రమ నుంచి విడుదలవుతున్న వ్యర్థ జలాలపై సమగ్ర విచారణ జరపాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. పరిశ్రమ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే మంజీరా నదిని కాలుష్యం నుంచి రక్షించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.సమస్యను అధికారులు నిర్లక్ష్యం చేస్తే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని గ్రామస్తులు హెచ్చరించారు. "మంజీరా మా జీవనాధారం. నదిని కలుషితం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని నదిని కాపాడాలి" అని వారు ప్రభుత్వాన్ని కోరారు.</div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt"></div>
</div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Sanga Reddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/sanga-reddy/charminar-beer-industry-polluting-manjira-river/article-3761</link>
                <guid>https://www.visionandhra.in/telangana/sanga-reddy/charminar-beer-industry-polluting-manjira-river/article-3761</guid>
                <pubDate>Tue, 28 Jul 2026 11:10:59 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1001137546.jpg"                         length="301987"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మంజీరా నదిలో రసాయన వ్యర్థాల విడుదల ఆరోపణలు..</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">చౌటకూర్, :చౌటకూర్ మండలం పరిధిలోని శివంపేట సమీపంలో ఉన్న ఏబీఐఎన్ చార్మినార్ బీర్ పరిశ్రమ నుంచి వర్షాకాలాన్ని సాకుగా చూపుతూ రసాయనాల కలిసిన వ్యర్థ జలాలను నేరుగా మంజీరా నదిలోకి విడుదల చేస్తున్నారని స్థానిక గ్రామస్థులు ఆరోపించారు.గ్రామస్థుల కథనం ప్రకారం, పరిశ్రమ నుంచి వస్తున్న వ్యర్థాల కారణంగా నదినీటి రంగు మారడంతో పాటు దుర్వాసన వెదజల్లుతోందని తెలిపారు. ఈ కాలుష్యం వల్ల పశువులు, పక్షులు, జలచరాల మనుగడకు ముప్పు ఏర్పడటమే కాకుండా, నదిపై ఆధారపడిన ప్రజల ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ విషయంపై గతంలోనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్థులు ఆరోపించారు. ప్రస్తుతం కూడా పరిశ్రమ యాజమాన్యం ఇది వర్షపు నీరేనని చెబుతోందని, అయితే నీటి రంగు మారడం, దుర్వాసన రావడం వంటి అంశాలు అనుమానాలకు తావిస్తున్నాయని పేర్కొన్నారు.కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, జిల్లా యంత్రాంగం</div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/sanga-reddy/allegations-of-discharge-of-chemical-waste-in-manjira-river/article-3760"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/sanareddy.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">చౌటకూర్, :చౌటకూర్ మండలం పరిధిలోని శివంపేట సమీపంలో ఉన్న ఏబీఐఎన్ చార్మినార్ బీర్ పరిశ్రమ నుంచి వర్షాకాలాన్ని సాకుగా చూపుతూ రసాయనాల కలిసిన వ్యర్థ జలాలను నేరుగా మంజీరా నదిలోకి విడుదల చేస్తున్నారని స్థానిక గ్రామస్థులు ఆరోపించారు.గ్రామస్థుల కథనం ప్రకారం, పరిశ్రమ నుంచి వస్తున్న వ్యర్థాల కారణంగా నదినీటి రంగు మారడంతో పాటు దుర్వాసన వెదజల్లుతోందని తెలిపారు. ఈ కాలుష్యం వల్ల పశువులు, పక్షులు, జలచరాల మనుగడకు ముప్పు ఏర్పడటమే కాకుండా, నదిపై ఆధారపడిన ప్రజల ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ విషయంపై గతంలోనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్థులు ఆరోపించారు. ప్రస్తుతం కూడా పరిశ్రమ యాజమాన్యం ఇది వర్షపు నీరేనని చెబుతోందని, అయితే నీటి రంగు మారడం, దుర్వాసన రావడం వంటి అంశాలు అనుమానాలకు తావిస్తున్నాయని పేర్కొన్నారు.కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి పరిశ్రమపై సమగ్ర విచారణ నిర్వహించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. నీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని కోరారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకోకపోతే ప్రజలతో కలిసి భారీ ఆందోళన చేపడతామని గ్రామస్థులు హెచ్చరించారు. </div>
<div style="text-align:justify;"> </div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Sanga Reddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/sanga-reddy/allegations-of-discharge-of-chemical-waste-in-manjira-river/article-3760</link>
                <guid>https://www.visionandhra.in/telangana/sanga-reddy/allegations-of-discharge-of-chemical-waste-in-manjira-river/article-3760</guid>
                <pubDate>Tue, 28 Jul 2026 11:06:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/sanareddy.jpg"                         length="831120"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అనారోగ్యం తో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సహాయం</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">చౌటకూర్  : పుల్కల్ మండల కేంద్రంలో గత మూడు రోజుల క్రితం గ్రామానికి చెందిన పోచన్నగారి జైలు అనారోగ్యం తో మృతి చెందరూ. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ లావణ్య కృష్ణారెడ్డి మృతి చెందిన వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. గ్రామంలో ఎటువంటి శుభ అశుభ కార్యాలు జరిగినప్పటికీ గ్రామ సర్పంచ్ తన పెద్ద మనసుతో సొంత నిధులతో ఆదుకోవటం ప్రజలు హర్షిస్తున్నారు. తమ గ్రామానికి 24 గంటలు అందుబాటులో ఉండే సర్పంచ్ ఉన్నందుకు గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఇప్పటికే తాను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం జరిగిందని గ్రామ అభివృద్ధికి ప్రజలందరు సహకరించాలని సర్పంచ్ లావణ్య కృష్ణారెడ్డి ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రవణ్ కుమార్మా,జీ ఎంపిటిసి శ్రీనివాస్ చారి,మంగళి బాబు, ఏసురత్నం,రాజు, తది తరులు పాల్గొన్నారు.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/sanga-reddy/financial-assistance-to-the-family-of-a-person-who-died/article-3752"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1001134805-(1).jpg" alt=""></a><br /><div style="text-align:justify;">చౌటకూర్  : పుల్కల్ మండల కేంద్రంలో గత మూడు రోజుల క్రితం గ్రామానికి చెందిన పోచన్నగారి జైలు అనారోగ్యం తో మృతి చెందరూ. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ లావణ్య కృష్ణారెడ్డి మృతి చెందిన వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. గ్రామంలో ఎటువంటి శుభ అశుభ కార్యాలు జరిగినప్పటికీ గ్రామ సర్పంచ్ తన పెద్ద మనసుతో సొంత నిధులతో ఆదుకోవటం ప్రజలు హర్షిస్తున్నారు. తమ గ్రామానికి 24 గంటలు అందుబాటులో ఉండే సర్పంచ్ ఉన్నందుకు గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఇప్పటికే తాను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం జరిగిందని గ్రామ అభివృద్ధికి ప్రజలందరు సహకరించాలని సర్పంచ్ లావణ్య కృష్ణారెడ్డి ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రవణ్ కుమార్మా,జీ ఎంపిటిసి శ్రీనివాస్ చారి,మంగళి బాబు, ఏసురత్నం,రాజు, తది తరులు పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Sanga Reddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/sanga-reddy/financial-assistance-to-the-family-of-a-person-who-died/article-3752</link>
                <guid>https://www.visionandhra.in/telangana/sanga-reddy/financial-assistance-to-the-family-of-a-person-who-died/article-3752</guid>
                <pubDate>Mon, 27 Jul 2026 18:08:36 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1001134805-%281%29.jpg"                         length="208578"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మంజీరాలో కలుస్తున్నది వర్షపు నీరే.</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div style="text-align:justify;">
<div>చౌటకూరు: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని శివంపేటలోని బీరు పరిశ్రమ నుంచి మంజీరా నదిలోకి వ్యర్థ జలాలను విడుదల చేస్తున్నారనే ప్రచారం అవాస్తవమని పరిశ్రమ కాంట్రాక్టు కార్మికులు స్పష్టం చేశారు. ఆదివారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సమావేశమైన కార్మికులు మీడియాతో మాట్లాడుతూ, పరిశ్రమలోని వ్యర్థ జలాలన్నింటినీ ప్రత్యేక శుద్ధి కేంద్రం (ఈటీపీ)లో శుద్ధి చేస్తున్నామని తెలిపారు. మంజీరా నదిలో కలుస్తున్నది పరిశ్రమ వ్యర్థ జలాలు కాదని, ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పరిశ్రమ పరిసరాల్లోకి చేరిన వర్షపు నీరేనని వారు వివరించారు. సంగారెడ్డి–నాందేడ్ జాతీయ రహదారి నిర్మాణం అనంతరం రోడ్డు పక్కన ఉన్న వరద కాలువ పూడిపోవడంతో వర్షపు నీరు దిగువకు వెళ్లలేక పరిశ్రమలోకి చేరుతోందని పేర్కొన్నారు. అనంతరం ఆ నీటినే పంపింగ్ ద్వారా బయటకు పంపుతున్నామని తెలిపారు.పరిశ్రమలో ఉత్పత్తి ప్రక్రియలో ఏర్పడే వ్యర్థ జలాలను ఈటీపీలో పూర్తిగా శుద్ధి చేస్తున్నామని, కొంత భాగాన్ని ట్యాంకర్ల ద్వారా</div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/sanga-reddy/darshan-of-mata-gnana-saraswati-on-the-occasion-of-mula/article-3736"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1001134585.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div style="text-align:justify;">
<div>చౌటకూరు: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని శివంపేటలోని బీరు పరిశ్రమ నుంచి మంజీరా నదిలోకి వ్యర్థ జలాలను విడుదల చేస్తున్నారనే ప్రచారం అవాస్తవమని పరిశ్రమ కాంట్రాక్టు కార్మికులు స్పష్టం చేశారు. ఆదివారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సమావేశమైన కార్మికులు మీడియాతో మాట్లాడుతూ, పరిశ్రమలోని వ్యర్థ జలాలన్నింటినీ ప్రత్యేక శుద్ధి కేంద్రం (ఈటీపీ)లో శుద్ధి చేస్తున్నామని తెలిపారు. మంజీరా నదిలో కలుస్తున్నది పరిశ్రమ వ్యర్థ జలాలు కాదని, ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పరిశ్రమ పరిసరాల్లోకి చేరిన వర్షపు నీరేనని వారు వివరించారు. సంగారెడ్డి–నాందేడ్ జాతీయ రహదారి నిర్మాణం అనంతరం రోడ్డు పక్కన ఉన్న వరద కాలువ పూడిపోవడంతో వర్షపు నీరు దిగువకు వెళ్లలేక పరిశ్రమలోకి చేరుతోందని పేర్కొన్నారు. అనంతరం ఆ నీటినే పంపింగ్ ద్వారా బయటకు పంపుతున్నామని తెలిపారు.పరిశ్రమలో ఉత్పత్తి ప్రక్రియలో ఏర్పడే వ్యర్థ జలాలను ఈటీపీలో పూర్తిగా శుద్ధి చేస్తున్నామని, కొంత భాగాన్ని ట్యాంకర్ల ద్వారా ప్రత్యేక శుద్ధి కేంద్రానికి తరలిస్తున్నామని కార్మికులు చెప్పారు. పరిశ్రమపై జరుగుతున్న తప్పుడు ప్రచారం వల్ల తమ ఉపాధికి ముప్పు వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.గత 30 సంవత్సరాలుగా శివంపేట గ్రామానికి చెందిన వందలాది మంది ఈ పరిశ్రమలో పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. ప్రస్తుతం ఉత్పత్తి తగ్గడంతో నెలలో 20 నుంచి 25 రోజులే పని దొరుకుతోందని, పరిశ్రమ మూతపడితే తమ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల ఉపాధి, భద్రతకు భరోసా కల్పించాలని కోరుతూ గ్రామ సర్పంచ్ కొత్తగడి సంధ్యరాణి భర్త మల్లికార్జున్ గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియా ప్రతినిధులను పరిశ్రమ సమీపానికి తీసుకెళ్లి, వర్షపు నీటిని పంపింగ్ చేస్తున్న ప్రాంతాన్ని చూపించి తమ వాదనను వివరించారు.</div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Sanga Reddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/sanga-reddy/darshan-of-mata-gnana-saraswati-on-the-occasion-of-mula/article-3736</link>
                <guid>https://www.visionandhra.in/telangana/sanga-reddy/darshan-of-mata-gnana-saraswati-on-the-occasion-of-mula/article-3736</guid>
                <pubDate>Mon, 27 Jul 2026 17:14:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1001134585.jpg"                         length="60096"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పుల్కల్ లో రోడ్డెక్కిన రైతన్నలు</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">చౌటకూర్  : సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలో ఉన్న పుల్కల్, మిన్పూర్, కోడూరు, గోంగ్లూర్, గ్రామాలలోనీ ఏటిలో ఏర్పాటు చేసుకున్న వ్యవసాయ మోటార్లకు ఎలాంటి ముందస్తు నోటీసు, చాటింపు లేదా సమాచారం ఇవ్వకుండా విద్యుత్ సరఫరా నిలిపివేయడాన్ని నిరసిస్తూ రైతులు సోమవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు ప్రధాన రహదారిపై రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు. అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పంటలకు నీరందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం పూర్తిగా నీటిపారుదలపై ఆధారపడి ఉన్న సమయంలో ఎలాంటి సమాచారం లేకుండా విద్యుత్ నిలిపివేయడం వల్ల పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా తీసుకున్న నిర్ణయం ఎంతవరకు సమంజసమనిప్రశ్నించారు. వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు ముందు రైతులకు తప్పనిసరిగా నోటీసులు జారీ చేయాలని డిమాండ్</div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/sanga-reddy/roadside-farmers-in-pulkal/article-3731"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1001134399.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">చౌటకూర్  : సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలో ఉన్న పుల్కల్, మిన్పూర్, కోడూరు, గోంగ్లూర్, గ్రామాలలోనీ ఏటిలో ఏర్పాటు చేసుకున్న వ్యవసాయ మోటార్లకు ఎలాంటి ముందస్తు నోటీసు, చాటింపు లేదా సమాచారం ఇవ్వకుండా విద్యుత్ సరఫరా నిలిపివేయడాన్ని నిరసిస్తూ రైతులు సోమవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు ప్రధాన రహదారిపై రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు. అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పంటలకు నీరందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం పూర్తిగా నీటిపారుదలపై ఆధారపడి ఉన్న సమయంలో ఎలాంటి సమాచారం లేకుండా విద్యుత్ నిలిపివేయడం వల్ల పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా తీసుకున్న నిర్ణయం ఎంతవరకు సమంజసమనిప్రశ్నించారు. వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు ముందు రైతులకు తప్పనిసరిగా నోటీసులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా విషయం తెలుసుకున్న పుల్కల్ తహసీల్దార్ వంశీకృష్ణ, స్థానిక సీఐ సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. వారి సమస్యలను ఓపికగా విన్న అధికారులు, సంబంధిత ఉన్నతాధికారులతో చర్చించి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే విద్యుత్ సరఫరా అంశాన్ని అత్యవసరంగా పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ..వ్యవసాయాన్ని దెబ్బతీసే విధంగా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్ సరఫరా నిలిపివేయడం సరికాదని, రైతుల జీవనాధారమైన సాగుకు ప్రభుత్వం, విద్యుత్ శాఖ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.</div>
<div style="text-align:justify;"> </div>
<div style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-07/1001133936.jpg" alt="1001133936" width="1280" height="572"></img></div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Sanga Reddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/sanga-reddy/roadside-farmers-in-pulkal/article-3731</link>
                <guid>https://www.visionandhra.in/telangana/sanga-reddy/roadside-farmers-in-pulkal/article-3731</guid>
                <pubDate>Mon, 27 Jul 2026 16:29:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1001134399.jpg"                         length="138013"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>చౌటకూర్ జడ్‌పీహెచ్‌ఎస్ పాఠశాల పరిసరాల పరిశుభ్రతకు శ్రీకారం</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">చౌటకూర్, సంగారెడ్డి : చౌటకూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జడ్‌పీహెచ్‌ఎస్) బయట పరిసరాలను పరిశుభ్రంగా, విద్యార్థులకు అనుకూలంగా తీర్చిదిద్దేందుకు సోమవారం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామ సర్పంచ్ పార్కుల రామ్‌రెడ్డి ఆధ్వర్యంలో పాఠశాల వెలుపల పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించి, రాకపోకలకు ఇబ్బందులు లేకుండా మొరం వేయించే పనులు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీపీ సుభాష్‌రెడ్డి ముఖ్యంగా సహకరించారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండడం వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలకు సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పడుతుందని నిర్వాహకులు తెలిపారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని సర్పంచ్ పార్కుల రామ్‌రెడ్డి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయు రాలు అనురాధ, ఉపాధ్యాయులు మోహన్ రెడ్డి, వినయ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్, రాజేశ్వర్ గౌడ్, కరుణాకర్, వార్డు సభ్యులు అశోక్, చక్రపాణి, గంగారాం తదితరులు పాల్గొని పరిశుభ్రత కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. గ్రామ</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/sanga-reddy/chautaukur-zphs-school-environment-cleanliness-initiative/article-3729"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1001133649.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">చౌటకూర్, సంగారెడ్డి : చౌటకూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జడ్‌పీహెచ్‌ఎస్) బయట పరిసరాలను పరిశుభ్రంగా, విద్యార్థులకు అనుకూలంగా తీర్చిదిద్దేందుకు సోమవారం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామ సర్పంచ్ పార్కుల రామ్‌రెడ్డి ఆధ్వర్యంలో పాఠశాల వెలుపల పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించి, రాకపోకలకు ఇబ్బందులు లేకుండా మొరం వేయించే పనులు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీపీ సుభాష్‌రెడ్డి ముఖ్యంగా సహకరించారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండడం వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలకు సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పడుతుందని నిర్వాహకులు తెలిపారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని సర్పంచ్ పార్కుల రామ్‌రెడ్డి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయు రాలు అనురాధ, ఉపాధ్యాయులు మోహన్ రెడ్డి, వినయ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్, రాజేశ్వర్ గౌడ్, కరుణాకర్, వార్డు సభ్యులు అశోక్, చక్రపాణి, గంగారాం తదితరులు పాల్గొని పరిశుభ్రత కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. గ్రామ ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ, పాఠశాల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరిస్తామని తెలిపారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Sanga Reddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/sanga-reddy/chautaukur-zphs-school-environment-cleanliness-initiative/article-3729</link>
                <guid>https://www.visionandhra.in/telangana/sanga-reddy/chautaukur-zphs-school-environment-cleanliness-initiative/article-3729</guid>
                <pubDate>Mon, 27 Jul 2026 16:19:18 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1001133649.jpg"                         length="178387"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్ నిలిపివేత.</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">చౌటకూర్,/ సంగారెడ్డి : పుల్కల్ మండలంలోని పుల్కల్, మిన్పూర్, కోడూరు, గోంగ్లూర్ గ్రామాల పరిధిలో ఏటిలో ఏర్పాటు చేసిన వ్యవసాయ మోటార్లకు ఎలాంటి ముందస్తు నోటీసు లేదా సమాచారం ఇవ్వకుండా విద్యుత్ సరఫరా నిలిపివేయడాన్ని నిరసిస్తూ రైతులు సోమవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ప్రధాన రహదారిపై సుమారు రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు.విద్యుత్ సరఫరా అకస్మాత్తుగా నిలిపివేయడంతో పంటలకు నీరందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సాగు పూర్తిగా నీటిపారుదలపై ఆధారపడి ఉన్న ఈ సమయంలో విద్యుత్ లేకపోవడం వల్ల పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా విద్యుత్ నిలిపివేయడం సరైన చర్య కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.ధర్నా విషయం తెలుసుకున్న పుల్కల్ తహసీల్దార్ వంశీకృష్ణ, స్థానిక సీఐ సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో చర్చించారు. రైతుల సమస్యలను</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/sanga-reddy/power-outage-without-prior-notice/article-3728"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1001134361.jpg" alt=""></a><br /><p style="text-align:justify;">చౌటకూర్,/ సంగారెడ్డి : పుల్కల్ మండలంలోని పుల్కల్, మిన్పూర్, కోడూరు, గోంగ్లూర్ గ్రామాల పరిధిలో ఏటిలో ఏర్పాటు చేసిన వ్యవసాయ మోటార్లకు ఎలాంటి ముందస్తు నోటీసు లేదా సమాచారం ఇవ్వకుండా విద్యుత్ సరఫరా నిలిపివేయడాన్ని నిరసిస్తూ రైతులు సోమవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ప్రధాన రహదారిపై సుమారు రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు.విద్యుత్ సరఫరా అకస్మాత్తుగా నిలిపివేయడంతో పంటలకు నీరందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సాగు పూర్తిగా నీటిపారుదలపై ఆధారపడి ఉన్న ఈ సమయంలో విద్యుత్ లేకపోవడం వల్ల పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా విద్యుత్ నిలిపివేయడం సరైన చర్య కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.ధర్నా విషయం తెలుసుకున్న పుల్కల్ తహసీల్దార్ వంశీకృష్ణ, స్థానిక సీఐ సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో చర్చించారు. రైతుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, భవిష్యత్తులో ఇలాంటి చర్యలు తీసుకునే ముందు తప్పనిసరిగా ముందస్తు సమాచారం ఇవ్వాలని, వ్యవసాయానికి ఆటంకం కలగకుండా విద్యుత్ శాఖ చర్యలు చేపట్టాలని కోరారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పుల్కల్, మిన్పూర్, కోడూరు, గోంగ్లూర్ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Sanga Reddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/sanga-reddy/power-outage-without-prior-notice/article-3728</link>
                <guid>https://www.visionandhra.in/telangana/sanga-reddy/power-outage-without-prior-notice/article-3728</guid>
                <pubDate>Mon, 27 Jul 2026 15:52:40 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1001134361.jpg"                         length="646596"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        